మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దని జేఏసీ తీర్మానం.. ఎందుకో చెప్పిన కేటీఆర్, కనిమొళి

Mana News :- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పాల్గొన్నారు. కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. డీలిమిటేషన్‌పై జేఏపీ ఓ తీర్మానం చేసి ఆమోదించింది. పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని ఉన్న నిబంధనను మరో 25 సంవత్సరాలు పొడిగించాలని తీర్మానంలో పేర్కొంది. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను పాటించాలని జేఏసీ చెప్పింది. జేఏసీ తీర్మానాన్ని డీఎంకే ఎంపీ కనిమొళి చదివి వినిపించారు. కాగా, డీలిమిటేషన్‌పై మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. నియోజక వర్గాల పునర్విభజనను ప్రశ్నించకపోతే తమను చరిత్ర క్షమించదని చెప్పారు. దీనిపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని చెప్పారు. ఈ రాష్ట్రాలపై కేంద్ర సర్కారు వివక్ష చూపుతోందని తెలిపారు. దాని వల్ల తెలంగాణలోనూ నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది మొత్తం నష్టపోతుందని, జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచాలని అనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని చెప్పారు. అభివృద్ధిలో మందున్న రాష్ట్రాలకు దీని వల్ల నష్టం జరుగుతుందని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం పని చేసిన రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని అన్నారు. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని చెప్పారు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుందని చెప్పారు.

Related Posts

మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మీర్పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి, అక్కడి సమస్యలను పరిశీలించారు. ఫెన్సింగ్ ధ్వంసమై ఉండటం, వీధిదీపాలు పనిచేయకపోవడం,…

ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా

mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి