నాగబాబు ఆస్తులెంత – అన్నయ్య, పవన్ కు అప్పు లెక్కలిలా..!!

Mana News :- మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. కూమటి నుంచి అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. రేపు (సోమవారం) నామినేషన్లకు చివరి రోజు.జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయటంతో..మిగిలిన నలుగురు టీడీపీ నుంచి నామినేషన్లు వేయనున్నారు. వారి పేర్లను ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడుకు పవన్ కు చెల్లించాల్సిన అప్పుల గురించి వివరించారు. నాగబాబు ఆస్తులు :-జనసేన నుంచి నాగబాబు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. ఎన్నికల అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపర్చారు. నాగబాబు తన ఆస్తుల విలువ70 కోట్లుగా వెల్లడించారు. నాగబాబుపైన ఎలాంటి కేసులు లేవు. కాగా, తనకు ఉన్న అప్పుల లెక్కలను వెల్లడిస్తూ అన్నయ్య చిరంజీవి.. తమ్ముడు పవన్ దగ్గర తీసుకున్న అప్పుల గురించి వివరించారు. నాగబాబు చరాస్తుల విలువ 59 కోట్లుగా పేర్కొన్నారు. బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ .. బాండ్ల రూపంలో రూ.55.37 కోట్లు ఉండగా, చేతిలో నగదు – రూ.21.81 లక్షలు ఉంది.ఇవీ లెక్కలు :- ఇక, బ్యాంకులో తన ఖాతాల్లో రూ 23.53 లక్షలు ఉన్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇతరుల నుంచి తాను రూ 1.03 కోట్లు అప్పులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తనకు ఉన్న బెంజ్ కారు విలు వ రూ 67.28 లక్షలుగా వెల్లడించారు. హ్యుండాయ్ కారు – రూ.11.04 లక్షలు, కాగా ఇక.. బంగారం -వెండి విలువ రూ.57.99గా వివరించారు.724 గ్రాముల బంగారం, తన సతీమణి వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు) ఉన్నాయి. అదే విధంగా.. హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. చిరంజీవి- పవన్ నుంచి అప్పు :- హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపర్చారు. రంగా రెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి విలువ రూ.5.3 కోట్లు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరా ల భూమి రూ.82.80 లక్షలు, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి ఉండగా.. దాని విలువ రూ.53.50 లక్షలుగా పేర్కొన్నారు. హైదరాబాద్ మణికొండలో విల్లా – రూ.2.88 కోట్లు గా వివరించారు. కాగా.. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.11.20 కోట్లు. ఇక.. తన సోదరులు చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు తీసుకోగా.. పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకు న్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇక, బ్యాంకుల్లో ఇంటి రుణం కింద రూ 56.97 లక్షలు, కారు కోసం తీసుకున్న రుణం రూ 7.54 లక్షలు ఉన్నట్లు వివరించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..