రాంగోపాల్ వర్మకు మరో షాక్- నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..!

Mana News :- టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏపీలో ఆయనపై నమోదైన కేసులపై నిన్న హైకోర్టు ఆరు వారాల పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. అంతలోనే ముంబై కోర్టు ఇవాళ ఆయన పిటిషన్ ను తోసిపుచ్చడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో వర్మకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీనిపై ఏం చేయాలనే అంశంపై లాయర్లతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ నిర్మాతకు రాంగోపాల్ వర్మకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయన దాఖలు చేసిన కేసులో ముంబై కోర్టు స్పందించింది. రాంగోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు సదరు నిర్మాతకు 3.72 లక్షలు పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని కోరారు. అయితే వర్మ పిటిషన్ ను ముంబై కోర్టు తోసిపుచ్చింది. గతంలో విధించిన మూడు నెలల జైలు శిక్షను రద్దు చేసేందుకు ముంబై సెషన్స్ కోర్టు నిరాకరించింది. అయితే వర్మ జడ్జి ముందు హాజరై బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆప్షన్ ఇచ్చింది. అదే సమయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా జారీ చేసింది. ఈ వారెంట్ అమలు కోసం కేసు విచారణ జూన్ 28కి వాయిదా వేశారు. దీంతో రాంగోపాల్ వర్మ తదుపరి చర్యలు తీసుకోకుండా ఏం చేయాలన్న దానిపై తన లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఏపీలో నమోదైన కేసుల విషయంలో న్యాయపోరాటం చేస్తున్న వర్మకు ముంబై కోర్టు ఉత్తర్వులు తలనొప్పిగా మారాయి.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///