హెచ్ ఆర్ పి సి సభ్యులచే ఉపాధ్యాయులకు ఘన సన్మానం.

చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరులోని గురుకుల పాఠశాలలో మానవ హక్కుల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా హెచ్ ఆర్ పి సి అధ్యక్షులు రమేష్ బాబు, మరియు కమిటీ సభ్యులు కలిసి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ.ఎస్. డబ్ల్యూ.ఓ నాగేశ్వర్ రావు, విశ్రాంత ఉపాధ్యాయులు సహదేవ నాయుడు, పూల మనోహర్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు రెడ్డి శేఖర్ రెడ్డి, పొన్నయ్య, జిల్లా లీగల్ అడ్వైజర్ రఘురాం, జిల్లా జానపద కళాకారుడు రెడ్డప్ప, అధ్యాపకులు అనంత కుమార్ లను ఆహ్వానించడం జరిగింది. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హెచ్ ఆర్ పి సి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులను జ్ఞానవంతులు గా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని జరుపుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు రంగాని సహదేవ నాయుడు, అలాగే పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనద ని పిల్లలకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వారి జీవితాలను అందంగా తీర్చిదిద్దే వాస్తు శిల్పులు కూడా, అని తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని విద్యార్థులకు మార్గదర్శక వెలుగుగా ఉండి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా పిల్లల జీవితాలను తీర్చిదిద్దడానికి నిస్వార్థం గా పనిచేసే ఉపాధ్యాయులను గౌరవించడానికి మనదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ‌ హెచ్ ఆర్ ఎస్ సి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను హెచ్ ఆర్ పి సి సభ్యులు ఘనంగా సత్కరించి మెమొంటో అందజేయడం జరిగింది. అనంతరం సన్మానం స్వీకరించిన ఉపాధ్యాయులు హెచ్ ఆర్ పి సి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు ని కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ లెవెల్ అడ్వైజర్ పూసల నరసింహులు, డిస్టిక్ లీగల్ అడ్వైజర్ రఘురాం, రాజేశ్వరిలు, మీడియా ఆఫీసర్, రామకృష్ణ, బ్లాక్ లెవెల్ ప్రెసిడెంట్ పాండురంగం, కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!