మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో పీఈటీలకు సత్కారం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో క్రీడా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పిఈటిలను ఘనంగా సత్కరించినట్లు మక్తల్ పట్టణ అధ్యక్షుడు ఏ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వరుసగా ఏడు రోజులపాటు క్రీడా వారోత్సవాలు నిర్వహించిందని అన్నారు.మక్తల్ పట్టణంలోనూ వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో క్రీడలను మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పీఈటీలను శాలువాలతో సత్కరించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా క్రీడా పాలసీని తీసుకొచ్చి, మారుమూల పల్లెల్లోని విద్యార్థులను సైతం మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారు కృషి చేస్తున్నారని అన్నారు.ఇటు మక్తల్ నియోజవర్గ కేంద్రంలో సైతం 25 కోట్లతో కనివిని ఎరుగని రీతిలో అన్ని రకాల సదుపాయలతో సరికొత్త హంగులతో స్టేడియం పునర్నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని, దీంతోపాటు ఉట్కూరు, నర్వ, ఆత్మకూరు ,అమరచింతలో సైతం క్రీడా మైదానాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా మంత్రి వాకిటి శ్రీహరి చర్యలు చేపడుతున్నారని అన్నారు. కనివిని ఎరుగని రీతిలో మక్తల్ నియోజకవర్గం ను క్రీడా హబ్ గా ఏర్పాటు చేసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, ఎంఈఓ అనిల్ గౌడ్, డీఎస్ఓ వెంకటేష్ శెట్టి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, శ్రీహరన్న సేవా సమితి సభ్యులు మొహమ్మద్ నూరుద్దీన్, అస్సాముద్దీన్, ఫయాజ్, అబ్దుల్ రెహమాన్, అఫ్రోజ్, బోయ నరసింహ, అనంపల్లి రమేష్, అశోక్ గౌడ్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ