మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో పీఈటీలకు సత్కారం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో క్రీడా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పిఈటిలను ఘనంగా సత్కరించినట్లు మక్తల్ పట్టణ అధ్యక్షుడు ఏ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వరుసగా ఏడు రోజులపాటు క్రీడా వారోత్సవాలు నిర్వహించిందని అన్నారు.మక్తల్ పట్టణంలోనూ వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో క్రీడలను మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పీఈటీలను శాలువాలతో సత్కరించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా క్రీడా పాలసీని తీసుకొచ్చి, మారుమూల పల్లెల్లోని విద్యార్థులను సైతం మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారు కృషి చేస్తున్నారని అన్నారు.ఇటు మక్తల్ నియోజవర్గ కేంద్రంలో సైతం 25 కోట్లతో కనివిని ఎరుగని రీతిలో అన్ని రకాల సదుపాయలతో సరికొత్త హంగులతో స్టేడియం పునర్నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని, దీంతోపాటు ఉట్కూరు, నర్వ, ఆత్మకూరు ,అమరచింతలో సైతం క్రీడా మైదానాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా మంత్రి వాకిటి శ్రీహరి చర్యలు చేపడుతున్నారని అన్నారు. కనివిని ఎరుగని రీతిలో మక్తల్ నియోజకవర్గం ను క్రీడా హబ్ గా ఏర్పాటు చేసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, ఎంఈఓ అనిల్ గౌడ్, డీఎస్ఓ వెంకటేష్ శెట్టి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, శ్రీహరన్న సేవా సమితి సభ్యులు మొహమ్మద్ నూరుద్దీన్, అస్సాముద్దీన్, ఫయాజ్, అబ్దుల్ రెహమాన్, అఫ్రోజ్, బోయ నరసింహ, అనంపల్లి రమేష్, అశోక్ గౌడ్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..