వరద ప్రాంతాల్లో స్వయంగా పర్యటన ప్రజలకు భరోసా..ఎస్పి రాజేష్ చంద్ర

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె–బాన్సువాడ, నిజాంసాగర్ రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టు విడుదలైన నీటి ప్రభావంతో చిన్నపూల్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.ఎస్పీ వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి,భారీ వర్షాల కారణంగా భవనం కొంతవరకు దెబ్బతిన్నదని,పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న విషయాన్ని గమనించి వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.నిజాంసాగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుమారు 78 మందిని గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో పునరావాస కేంద్రంలో ఉంచగా ఎస్పీ రాజేష్ చంద్ర వారిని కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వారికి పండ్లు అందజేశారు.
వర్షకాలంలో పోలీసులు అందిస్తున్న సేవలను ప్రజలు ప్రశంసిస్తూ ఎన్నో ప్రాణాలు మీ చేతుల మీదుగా కాపాడబడ్డాయిఅంటూ ఎస్పీ రాజేష్ చంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.ఎస్పి వెంట డీఎస్పీ విఠల్‌రెడ్డి సీఐలు తిరుపతయ్య, రాజారెడ్డి,నిజాంసాగర్‌ ఎస్సై శివకుమార్‌ ఉన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..