కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరిమన న్యూస్ : కలిగిరి ప్రాథమిక వైద్యశాల డాక్టర్లపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని కలిగిరి మండల అధ్యక్షురాలు ముట్టుకూరు శిరీష రెడ్డి ఎంపీడీవో ప్రత్యూషను కోరారు. కలిగిరి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ప్రత్యూష అధ్యక్షత వహించగా ఎంపీపీ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్నీ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రాదేశిక సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు పాల్గొనాల్సి ఉంది. అయితే బుధవారం జరిగిన కార్యక్రమానికి అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ మొక్కుబడిగా హాజరై మండల సమావేశం జరిగిందని పంపించారు. ఆశించిన స్థాయిలో సభ్యులు హాజరు కాలేదు. ఇది ఇలా ఉంటే కలిగిరి ప్రాథమిక వైద్య కేంద్రాన్ని 24 గంటల వైద్యశాలగా మార్చి అక్కడ ఇద్దరు డాక్టర్లను తగినంతమంది సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. అయితే గత మూడు సర్వసభ్య సమావేశాల నుండి కలిగిరి వైద్యాధికారులు సమావేశాలకు హాజరు కాకుండా వారి సిబ్బందిని మాత్రమే సమావేశాలకు పంపుతున్నారని దీనివలన సమావేశంలో వివరించాల్సిన అంశాలను వైద్యాధికారి రానందువలన ప్రజాప్రతినిధులకు చేరవేయలేకపోతున్నామని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాలలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్న సమావేశాలకు డుమ్మా కొట్టడం ఏంటని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైద్యాధికారి విధులకు సైతం సక్రమంగా హాజరు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయని ఎంపీపీ మండిపడ్డారు. వైద్యాధికారులు విధులకు హాజరు కాకుండానే సంతకాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలాంటి అధికారిపై వెంటనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలంటూ ఎంపీడీవో కి తెలిపారు. అదేవిధంగా సర్వసభ్య సమావేశానికి హాజరు కానీ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండి వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు గ్రామాల్లో తిరగాలని ప్రజలకు కూడా ఇళ్లల్లో నీటిని నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందజేయాలని వ్యవసాయ అధికారులకు తెలియజేశారు.

  • Related Posts

    చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

    వరికుంటపాడు,,మనన్యూస్: గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మండల కేంద్రంలోని వరికుంటపాడు గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని, కరుణా కటాక్షాలు కలగాలని, వేగంగా పనులు జరగాలని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.…

    పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    కలిగిరి, మన న్యూస్ : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. బడివైపు ఒక అడుగు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి శ్రీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

    చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

    పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

    ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

    ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

    గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

    గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

    రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

    రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

    పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు

    పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు