

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:– కోస్గి పట్టణంలోని జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో బ్యాడ్ కామెంట్ , రాంగ్ కల్, రాంగ్ మెసేజ్ మొదలగు సమస్యలపై విద్యార్థులకు షి టీమ్ పోలీసులు*అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు మాట్లాడుతూ,మహిళలకు విద్యార్థులకు షి టీమ్ పోలీసులు అండగా ఉంటారని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వేధింపులకు గురైన షీ టీమ్ పోలీసులను నేరుగా సంప్రదించవచ్చు, లేదంటే షీ టీం no 8712670398 కి కాల్ చేసి సమస్య ని చెప్పవచ్చు అని కంప్లైంట్ ఇఛ్చిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగ ఉంచడం షీ టీం యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. అలాగే ఏ హెచ్ టీ యు మానవ అక్రమ రవాణా జరగకుండా నివారించుటకి పనిచేస్తుంది.మానవ అక్రమ రవాణా చేసి ఆర్గాన్స్ అమ్మడం, వెట్టిచాకిరీ చేపించడం, వ్యభిచారం, బాల్య వివాహాలు చేపించడం జరుగుతుంది.ఇలాంటివి జరగకుండా ఏ హెచ్ టీ యు పనిచేస్తుంది అని తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఒంటరి మహిళలకు, వేధింపులకు గురైన వారికి, చైల్డ్ మ్యారేజెస్ సంబంధించిన మహిళలకు విద్యార్థులకు భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని బాధిత మహిళలు భరోసా సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే అమ్మాయిలకి, ఆడవారికి ఏ ఇబ్బంది ఎదురైనా నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించవచ్చు అని షీ టీమ్ పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమానికి షి టీమ్ పోలీసులు బాలరాజు, జ్యోతి, కవిత, విద్యార్థులు పాల్గొన్నారు.