రైతులకు పెట్టుబడి భరోసా – రూ140.07 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ

గద్వాల జిల్లా మన న్యూస్. రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు అభివృద్ధినే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద,వానాకాలం సాగు ప్రారంభానికి ముందే గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 19జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న,సన్నకారు రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం జమ చేసిందని తెలిపారు.ఈరోజు గురువారం సాయంత్రం వరకు నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన 1,35,024 మంది రైతులకు 140 కోట్లు 7 లక్షల 76 వేల 525 రూపాయలు సాయం అందించబడిందని తెలిపారు.ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం వల్ల వారు ఎలాంటి ఆలస్యం లేకుండా విత్తనాలు, ఎరువులు,కూలీల ఖర్చులు మొదలైన అవసరాలను తీర్చుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. రైతుల బ్యాంక్ ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ శాఖ అధికారులు రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయడం,వారి భూ వివరాలను అనుసరించి అర్హత గలవారికి నిధులను విడుదల చేయడం వంటి ప్రక్రియలు సమర్థంగా నిర్వహించబడినట్టు తెలిపారు.మిగిలిన రైతుల ఖాతాల్లోనూ త్వరలోనే నిధులు జమ చేయబడతాయన్నారు.రైతు భరోసా పథకం వల్ల పెట్టుబడి భారం తగ్గి రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ పథకం రైతులకు కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా స్థిరత్వాన్ని ఇస్తోందని,ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని కలెక్టర్ తెలిపారు. విత్తనాలు వేసే ముందే సాయం అందడం వల్ల రైతులు అప్పుల ఊబిలో పడకుండా సాగు చేసే అవకాశం లభిస్తుందని,ఇది వ్యవసాయ ఉత్పాదకతను మరింత పెంపొందించగలదని అన్నారు.ప్రతి ఎకరాకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తోందని తెలిపారు. ఇది కేవలం నిధుల పంపిణీ మాత్రమే కాదు – రైతన్నలపై ప్రభుత్వం ఉంచిన విశ్వాసానికి నిదర్శనం,” అని కలెక్టర్ స్పష్టం చేశారు.

Related Posts

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: ఆంద్రప్రదేశ్ లోని పాణ్యం దగ్గర మృతదేహం లభ్యం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కట్టుకున్న అలె కడ తెర్చిందా అనే కోణంలో దర్యాప్తు,మృతుడు ఆచూకీ లభ్యంతో అనేక అనుమానాలు…ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధలతో కట్టుకున్న…

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మునిసిపాలిటీలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (MAE)గా పని చేస్తున్న శ్రీ రాజశేఖర్‌ను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో మే 20న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు