ఏడాదిలోనే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలకు మంత్రి లోకేష్ నాంది పలికారుమంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

విద్యకే కూటమి ప్రభుత్వం పెద్దపీట

ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం

షైనింగ్ స్టార్స్ అవార్డులతో పేద విద్యార్థులకు ప్రోత్సాహం

సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి

మన న్యూస్ సింగరాయకొండ:-

విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం నాడు సాంఘిక మంత్రి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….. పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం సన్న బియ్యంతో అన్నం పెడతామని చెప్పి పేదల ఆశలకు సున్నం పెట్టారని దుయ్యబట్టారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచారన్నారు. విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పించారని కొనియాడారు. ప్రాథమిక పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు.షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ 20వేల ప్రైజ్ మనీ తో ప్రోత్సహిస్తూ వారిలో సాధించాలనే పట్టుదలను పెంచుతున్నామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

Related Posts

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంను జాతీయ సేవ పథకం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి…

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

మన న్యూస్ తవణంపల్లె జూన్-26 మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత  ప్రిన్సిపల్

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష లో మెరిసిన వెంగంపల్లె విద్యార్థిని నక్కల ఝాన్సీ రెడ్డి

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…