ఎమ్మెల్యే తోట ను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మద్నూర్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య ను నియోజకవర్గ నాయకులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లను ఎంపిక చేసిన విధానాన్ని గురించి మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్వ్యూ పద్ధతిలో మార్కెట్ కమిటీ చైర్మన్ లను ఎంపిక చేశామని తెలిపారు. స్థానిక మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకుల సమక్షంలో ఆశావాహులందరిని విడి విడిగా కొన్ని ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశామని గుర్తు చేశారు. ఎవరైతే సరైన సమాధానాలు చెప్పి ఎక్కువ మార్కులు సాధించారో వారినే చైర్మన్ గా ఎంపిక చేశామని మంత్రికి వివరించారు. జుక్కల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని చెప్పారు. ఆ విధంగా ఎంపికైన మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్యను మంత్రి ని పరిచయం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన సౌజన్య ఉన్నత విద్యావంతురాలు అని, ఇంటర్వ్యూ విధానాన్ని అమలు చేసినందకు ఈ పదవికి అర్హత సాధించిందని చెప్పారు. నూతన విధానంలో ఏఎంసి చైర్మన్ ల ఎంపిక చేపట్టిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన సౌజన్య శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంటా సీనియర్ నాయకులు తదితరులున్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///