కరెంటు కష్టాలతో రైతులు ఇక్కట్లు, ఒకే రోజు 20 సార్లు కరెంటు కట్టు’మోటార్లు పట్ – అధికారులను నిలదీస్తున్న రైతులు.

మన న్యూస్ నర్వ మండలం :- నర్వ మండల పరిధిలోని సిపూరు గ్రామంలో కరెంటు సరిగా రాక కరెంటు కష్టాలలో రైతులు ఇబ్బంది పడుతున్నామని సిపూర్ గ్రామ రైతులు మంగళవారం రోజు కల్వాల్ సబ్ స్టేషన్ లో అధికారులను నిలదీశారు. సోమవారం రోజు కరెంటు పది నిమిషాలు కూడా సరిగా నిలువ లేక, కరెంటు 20 సార్లు పోయి పోయి రావడంతో సిపూరు గ్రామంలో మోటర్లు ఖాళీ, పైపులైన్లు పగిలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిపూర్ గ్రామంలో యాసంగి వరి పంటలు ముగియడంతో, మరియు ఇప్పుడున్న చెరుకు మునగ తోట్లు దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు తెలియజేశారు. నర్వ మండల కేంద్రంలో మొత్తం మూడు సబ్ స్టేషన్లు ఉన్న, మిగతా రెండు సబ్ స్టేషన్ లో కరెంటు యధావిధిగా కొనసాగుతున్న, కల్వల్ సబ్ స్టేషన్ కరెంటు సరిగా సరఫరా అవ్వట్లేదని రైతులు మండిపడ్డారు. కరెంటు ఎందు గురించి సరిగా ఇవ్వట్లేదని లైన్ మాన్ ను, ఆపరేటర్లను రైతులు అడిగితే, కరెంటు లైన్ ల కింద చెట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఊసులు చెప్పుతూ కాలం వెలదీస్తున్నారని రైతులు తెలిపారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఫోను తీయట్లేదని రైతులను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. ఇలాగే కరెంటు పోయి పోయి వస్తే చెరుకు మరియు మునగ తోటలు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు గమనించి రైతులను దృష్టిలో ఉంచుకొని సరైన వేళలో కరెంటు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపూర్ గ్రామ చెరుకు మరియు మునగ తోట రైతులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు