బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మనన్యూస్ బంగారుపాళ్యం ఏప్రిల్-29*పూతలపట్టు నియోజకవర్గం,బంగారుపాళ్యం మండలం కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. మంగళవారం ఉదయం బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన *”పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* స్ధానిక మండల నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషను శిక్షణ తరగతులను మండల అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళల ఆర్ధిక స్వావలంబనతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా బంగారుపాళ్యం మండలానికి దాదాపు 200 కుట్టు మిషన్లను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. 75 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల శ్రేయస్సు కోరి అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలు చేసే ఘనత ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబిగా మారితేనే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చేందుతుందని నమ్మిన చంద్రబాబు గారు మహిళల కోసం అనేక ఉపాధి అవకాశాలు తీసుకొస్తున్నట్లు తెలియజేశారు. ఇది కేవలం శిక్షణా తరగతుల మాత్రమే కాదు. “మహిళ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశంగా తీసుకోవాలని, మీరు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మీతో పాటు మరికొంతమంది ఉపాధి కల్పించే స్ధాయికి ప్రతి మహిళ ఎదగాలని ఆశిస్తున్నట్లు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి జనార్థన్ గౌడ్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్.పి‌. ధరణీ నాయుడు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్ మరియు మండల నాయకులు, అధికారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి