తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా రూపేష్

మన న్యూస్,తిరుపతి,మార్చి 16:-తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా రూపేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగరంలోని ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా భాషా, కోశాధికారిగా మల్లికార్జున్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు కన్వీనర్ గా బొడుగు మునిరాజా యాదవ్ వ్యవహరించారు. సుమారు 500 మంది తిరుపతిలోని ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన రూపేష్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చునని, ఏ ఒకరికి సమస్య వచ్చినా తనది గా భావించి సమస్య పరిష్కరించేందుకు దృష్టి సారిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు, కేశినేని ట్రావెల్స్ సుబ్రమణ్యం, ఎంఎంఆర్ ట్రావెల్స్ ముని చంద్ర, గరుడ ట్రావెల్స్ రాము, జగన్, ట్రావెల్స్ మురళి లతో పాటు పలువురు ట్రావెల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు