అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి – మంత్రి నాదెండ్ల మనోహర్ కు గౌరీ నాయుడు వినతి పత్రం

పిఠాపురం మార్చి 10 మన న్యూస్:- పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ అతిథి అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ కిలారి గౌరీ నాయుడు కాకినాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను బోధిస్తూ విద్యారంగ అభివృద్ధికి విశేష సేవలను అందిస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యలపై డాక్టర్ గౌరీ నాయుడు మంత్రితో చర్చించారు. ఒక కళాశాలలో పర్మినెంట్ అధ్యాపకుల బదిలీలు జరిగినప్పుడు అతిధి అధ్యాపకులను పోస్టు ఖాళీగా ఉన్న డిగ్రీ కళాశాలకు పంపించేలాగ విద్యాశాఖ జీవో జారీ చేసేలాగ కూటమి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నెలవారి ఇచ్చే జీతం గంటల చొప్పున కాకుండా సంవత్సరంలో 12 నెలలు కన్సాలిడేటెడ్ జీతం ప్రభుత్వం ఇచ్చేలాగ ప్రభుత్వం తరపున సహకారాన్ని అందించాలని విన్నవించారు. గత సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ అతిథి అధ్యాపకుల సంఘం నాయకులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్. ఎన్.వర్మ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలో కలిసినప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారని గౌరీ నాయుడు తెలిపారు. జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరపున సహకారాన్ని అందిస్తానని మంత్రి మనోహర్ హామీ ఇవ్వటం పట్ల గౌరీ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ, రాష్ట్ర తూర్పు కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్వినీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆంధ్రప్రదేశ్ అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు