Mana News :- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత నెలకొంది. ఈ తరుణంలోనే… అర్థరాత్రి 2 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు జగదీప్ ధన్ఖడ్. ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో ధన్ఖడ్కు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీ ఎయిమ్స్‌లోని కార్డియాక్ విభాగంలో చేరారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు ఎయిమ్స్ వైద్యులు. ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జగదీప్ ధన్కడ్… ఇంకా మత్తులోనే ఉన్నారట. ఇక భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్యంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *