వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-6: పదవ తరగతి విద్యార్థుల పరీక్షల తర్పీదు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వందరోజుల కార్యక్రమం పురోగతిని పరిశీలించేందుకు స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డి.ఒ. పి. వీరేంద్ర ఈరోజు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, పరీక్షలపై సమగ్ర దృష్టి పెట్టాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమూల్యమైన సూచనలు అందించారు. హెచ్‌.యం‌.కం. ప్రిన్సిపాల్ ఎ. పి. లలిత మాట్లాడుతూ, ఎం.పి.డి.ఒ. సందర్శన పాఠశాల సిబ్బంది, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. అనంతరం ఎం.పి.డి.ఒ. వీరేంద్ర, ఉపాధ్యాయులు జె. భాస్కర్ రెడ్డి, కనకాచారి, చిట్టిబాబు, కె. భారతిలతో సమావేశమై మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధతో తర్పీదు అందించాలి, వారి భవిష్యత్తు మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సువర్ణ, వెల్ఫేర్ అసిస్టెంట్ కవితలు పాల్గొన్నారు. పాఠశాల వందరోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఎం.పి.డి.ఒ. పాఠశాల సిబ్బందికి స్పష్టం చేసినట్లు పాఠశాల వర్గాలు తెలియజేశాయి.

Related Posts

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-6 యాదమరి మండలంలో ఇటీవ‌ల బదిలీపై చేరిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత గౌరవం, వారి పాత్రకు తగ్గ బాధ్యతలు అప్పగించినట్లు మండల అధ్యక్షులు ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి.సురేష్ రెడ్డి తెలిపారు. కె.ఆర్‌.పి హైస్కూల్ విభాగం కార్యదర్శిగా…

బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

జియ్యమ్మవలస/ గుమ్మలక్ష్మీపురం/ మనధ్యాస డిసెంబర్6గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేటకు చెందిన తులాల రవిగారి బావ-మరిది, సేనాపతి బాలకృష్ణ శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి శనివారం రోజున దివంగత బాలకృష్ణ స్వగృహానికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్

కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్