యాదమరి మండలంలో కో-ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజీ అవసరం – ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి

యాదమరి, మన ధ్యాస నవంబర్-20: యాదమరి మండలంలోని ఏకైక బాలికల ఇంటర్‌మీడియట్ కాలేజీ కె. గొల్లపల్లె హైస్కూల్‌లో మాత్రమే ఉండటంతో, దానిని కో-ఎడ్యుకేషన్‌గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు స్థానిక శాసనసభ్యులు పూతలపట్టు యం.ఎల్.ఎ డాక్టర్ కలికిరి మురళీమోహన్కి విన్నవించాయి. మండలంలోని ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం సుమారు నాలుగు వందలకుపైగా బాలబాలికలు పదవ తరగతి చదువుతున్నారు. అయితే ఇంటర్‌ స్థాయిలో బాలురకు ప్రభుత్వ రంగంలో స్థానికంగా సౌకర్యాలు లేకపోవడంతో వారు చిత్తూరు పట్టణంలోని ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వెళ్ళాల్సి వస్తోంది. ఇది పేద కుటుంబాలకు ఆర్థికభారం పెంచడమే కాకుండా ప్రయాణ, భద్రతా సమస్యలను కూడా కలిగిస్తోందని ఉపాధ్యాయ నాయకులు వివరించారు. ఈ నేపథ్యంలో కె. గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను కో-ఎడ్యుకేషన్ కాలేజీగా మారుస్తే మండలంలోని విద్యార్థులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు కోరారు. ఈ విన్నపాన్ని పి.ఆర్.టి.యు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె. కనకాచారి, జిల్లా తెలుగునాడు అధ్యక్షులు వై. మధుసూదన్, ఏ.పి.పి.జి.టి.ఎ రాష్ట్ర కౌన్సిలర్ కె. దామోదర రెడ్డి, పి.డి. చిట్టిబాబు, పి.ఆర్.టి.యు రాష్ట్ర కౌన్సిలర్ జె. భాస్కర్ రెడ్డి కలిసి యం.ఎల్.ఎ కి అందజేశారు.

Related Posts

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

  • By RAHEEM
  • December 8, 2025
  • 2 views
కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి