హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి,ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు,

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, క్రీడల్లో అత్యున్నత స్థాయిలో రాణించేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. మఖ్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రవికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ధ్యాన్ చంద్ వరుసగా మూడు ఒలింపిక్స్ లో ఒంటి చేత్తో భారత దేశానికి హాకీలో బంగారు పతకాలు తీసుకుని వచ్చాడని, ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.ఎలాంటి సదుపాయాలు లేని సమయంలో, హకీలో మంత్రముగ్ధులను చేస్తూ, ధ్యాన్ చంద్ చూపించిన ప్రదర్శన,అలనాటి జర్మనీ నియంత హిట్లర్ ను సైతం కట్టిపడేసిందని అన్నారు. ధ్యాన్ చంద్ మైదానంలో ఉంటే ప్రత్యర్థులు ఆశలు వదులుకునే వారని అన్నారు. అందుకే ధ్యాన్ చంద్ కు హాకీ మాంత్రికుడు అనే బిరుదు వచ్చిందని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తూ, సరికొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకు వచ్చిందని, క్రీడల్లో అత్యున్నత స్థాయికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. క్రీడలతో మెరుగైన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభించి అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. విద్యార్థులకు చిన్న నాటి నుంచే క్రీడలపై ఆసక్తి కలిగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రవికుమార్, మార్కెట్ డైరెక్టర్లు శ్రీనివాస్, ఫయాజ్, కట్టా వెంకటేష్, మందుల నరేందర్, బోయ వెంకటేష్, ఓబులేష్, అస్మొద్దీన్, కల్లూరి గోవర్దన్, బ్యాగరి సురేష్, తిరుమలాపూర్ నరసింహఅఫ్రోజ్, ఆనంపల్లి రమేష్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

పేదోడి సొంతింటి కల నెరవేరింది..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?