

వింజమూరు, మనన్యూస్::వింజమూరు మండలం నంది గుంట పంచాయతీ లో మంగళవారం రాత్రి జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వింజమూరు మండలం తెలుగుదేశం నాయకత్వంలో నంది గుంట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు నీరాజనాలు పలికారు. ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ, ఇంటింటికి తిరిగారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం మార్గాలను చూపారు. మహిళలు స్వాగతం పలికి, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం లో అభివృద్ధి సంక్షేమ పథకాలకు కొదవలేదు, అన్ని పథకాలు అందుతున్నాయి అంటూ, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సారథ్యంలో ఉదయగిరి సిరుల గిరిగా అభివృద్ధి చెందుతుంది అని చెందుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు, క్లస్టర్ , యూనిట్ ఇంచార్జీలు, బూత్ కన్వీనర్ల సారధ్యంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గంగ పట్ల వెంగయ్య, ఎంపీటీసీ సభ్యులు బసిరెడ్డి సుమలత, బసిరెడ్డి జయంత్ రెడ్డిల ఆధ్వర్యంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, కోడూరు నాగిరెడ్డి, కొండపల్లి వెంకటేశ్వర్లు నాయుడు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల నారాయణరెడ్డి, బిజెపి మండల కన్వీనర్ డేగ మధు యాదవ్, పాములపాటి మాల్యాద్రి, వై పెంచలరావు తదితరులు పాల్గొన్నారు.