

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మయినా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ మహిళల లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు అందించి ఆయన మాట్లాడారు.మంజూరైన ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలని ప్రస్తుతం మక్తల్ కు మొదటి విడత లో 291 ఇండ్లు మంజూరైయ్యని పూర్తిచేసి మళ్లీ ఇంకా ఇండ్లను మంజూరి చేయడానికి కలెక్టర్ తో సంభాషించానని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెల్లోనే ఇందిరమ్మ ఇళ్ల ప్రెసిడింగులను లబ్ధిదారులకు అంద చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేతుల ప్రభుత్వము పేదలకు అండగా ఉండే ప్రభుత్వం అని మాటలు చెప్పె ప్రభుత్వం కాదనడానికి లబ్ధిదారులకు ప్రెసిడెంట్లు అందజేయడం నిదర్శనమన్నారు .ఇప్పటివరకు రైతులకు ఉన్న కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని ప్రస్తుతం రైతులు రైతు భరోసా అందించి సాగుకు సాయం అందించిన ఘనత తమదే అని ఆయన అన్నారు, లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకుంటే బిల్లులను విడుతల వారీగా లబ్ధిదారుల ఖాతాకు మంజూరు చేస్తుందని అందుకు ప్రతి ఒక్కరూ ఇళ్ళనిర్మాణం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బిల్లుల పై అపోహలు వద్దని విడతల వారిగా బిల్లులు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిష్యుద్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ లను అందజేశారు.ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్,స్థానిక ఎంపీడీవో. మున్సిపల్ కమిషనర్. పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.