పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సింగరాయకొండ కు చెందిన నక్కన వెంకట సుబ్బారెడ్డి (వెటర్నరీ అసిస్టెంట్) తన ప్రతి పుట్టినరోజు సందర్బంగా పాఠశాల విద్యార్థులకు 5000₹ విలువైన శ్రవణ ఉపకరణం బహూకరించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక మండల విద్యాశాఖ అధికారి-2 ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాల పిల్లలందరూ పాఠశాలలో చదువుకోవాలని కలెక్టర్ బంగారు బాల్యం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని పిల్లల యొక్క అవసరాలను గుర్తించి వారికి మంచి భవిష్యత్తును అందించాలంటే పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని సూచించారు. స్థానిక వెటర్నరీ డాక్టర్ వడ్లమూడి హజరత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని పెద్దవారైన తర్వాత వారు కూడా సమాజ శ్రేయస్సుకు తోడ్పాటు అందించాలని సూచించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు చిన్నారులకు కౌన్సిలింగ్ ఇస్తూ విద్యను విద్యార్థి మాత్రమే నేర్చుకోవాలని, తను నేర్చుకున్న విద్య తనలోనే నిక్షిప్తమై ఉంటుందని ప్రాక్టికల్ గా తెలియజేసి అనంతరము పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులలో అవగాహన కల్పించుటకు పాఠశాల ఆవరణలో పిల్లల భాగస్వామ్యంతో మొక్కను నాటించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, ఉపాధ్యాయులు అజయ్ చౌదరి,వెటర్నరీ అసిస్టెంట్లు చల్లా సురేంద్ర, నూకసాని శ్రీనివాసులు పాల్గొన్నారు.

Related Posts

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ ర్యాలీ నిర్వహించినకలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ ,

మనన్యూస్ కలిగిరి : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి లోని మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ,కలిగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ వెంకటనారాయణ . ఎస్సై ఉమశంకర్, మరియు, కొండాపురం, జలదంకి,మండలాల ఎస్సై లతో కలిసి అవగాహన…

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్

గద్వాల, జూన్ 26 (మన న్యూస్):– తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన దారుణ ఘటన Jogulamba గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మర్డర్ మిస్టరీని కొద్ది రోజుల వ్యవధిలోనే ఛేదించి, మొత్తం 8…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ-ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ ర్యాలీ నిర్వహించినకలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ ,

మారకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి అంటూ ర్యాలీ నిర్వహించినకలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ నారాయణ ,

జాతీయ కబడ్డీ జట్టు స్థానం సంపాదించిన గద్వాల బాలిక

జాతీయ కబడ్డీ జట్టు స్థానం సంపాదించిన గద్వాల బాలిక