

మన న్యూస్ సాలూరు జూన్ 26 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ,సాలూరు పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ అప్పలనాయుడు. సాలూరు జూనియర్ సివిల్ జడ్జీకోర్టు అధికారి హర్షవర్ధన్. వారితో కలిసి అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణ జూనియర్ కళాశాల విద్యార్థులు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది స్వచ్ఛంద సేవాసంస్థలు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు మెప్మాసిబ్బంది,వివిధ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక అవగాహనర్యాలీ,చేపట్టి మాదక ద్రవ్యాలు వద్దు ఆరోగ్యమే ముద్దు అనే నినాదాలతో పట్టణ మంతా హోరెత్తించి డీలక్స్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డుమీదుగా తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా వెళ్లి అవగాహన ర్యాలీ చేపట్టి మానవహారం చేపట్టారు. ఈసందర్భంగా సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అధికారి హర్షవర్ధన్.సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు.వారు మాట్లాడుతూ విద్యార్థులు యువత, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు అలవాటు పడి, విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఈకార్యక్రమంలో సాలూరు పట్టణ జూనియర్ సివిల్ జడ్జికోర్టు లాయర్లు సిబ్బంది, మెడికల్ అధికారి డాక్టర్ శివకుమార్. మున్సిపల్ మేనేజర్ బి.ఏం.ప్రసాద్. సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. కార్యాలయపు సిబ్బంది.ఎక్సైజ్ శాఖ అధికారులు,రెవిన్యూ అధికారులు,నీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ వేణు. కళాశాల విద్యార్థులు వివిధ శాఖా అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థలు అంగన్వాడీ టీచర్లు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
