

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 25: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శాంతి నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఎన్నికల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం కోసం కృషి చేసిన వారికి ఏళ్ల వేళల అండగా ఉంటానని.రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని,వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించాలేరు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకుపొద్ది అని ,అన్నారు.ఏది ఏమైనప్పటికీ గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం ఇతర పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు సైతం కాంగ్రెస్ పార్టీ గెలుపు లో భాగస్వాయం పంచుకోవాలని గ్రామాల అభివృద్ధి ఏ లక్ష్యంగా ఉండాలని అన్నారు.ఈ సందర్బంగా ఎఐసిసి కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ సంపత్ కుమార్ లాంటి నాయకుడు అలంపూర్ ప్రజలకు దొరకడం దేవుడు యిచ్చిన వరంఅని సంపత్ కుమార్ గెలిచిన ఓడినా ప్రజల్లో ఉండే వ్యక్తి అని దేశ వ్యాప్తంగా మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అని అంతేకాకుండా త్వరలోనే గద్వాల జిల్లా అలంపూర్ నియోజగ వర్గ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి వెంట శుభవార్తను వినబోతున్నారు అని కూడా అన్నారు.సంపత్ కుమార్ యంగ్ అండ్ డైనమిక్ విజనరి లీడర్ నీ గెలిపించుకోలేకపోయిన దురదృష్టవంతులు అలంపూర్ ప్రజలు అని .గెలిచి ఉంటే తప్పక మంత్రి హోదాలో అలంపూర్ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ది చేసేవారు అని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ ,అబ్సర్వర్ దీపక్ జాన్ ,వెంకటేష్ , గ్రంథాలయ ఛైర్మెన్ నీలి శ్రీనివాస్ గారు మార్కెట్ కమిటి చైర్మెన్ దొడ్డప్ప ,వైస్ చైర్మెన్ కుమార్ , RTA కమిషన్ MEMBER పల్లీ సతీష్ రెడ్డి ,మాజీ ఆర్డిస్ చైర్మెన్ సీతారామ రెడ్డి ,కిసాన్ సెల్ అధ్యక్షులు కొంకల నాగరాజు ,మహిళ జిల్లా అధ్యక్షురాలు నాగాశిరోమణి ,అన్ని మండలాల అధ్యక్షులు పదాధికారులు,ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.