సింగరాయకొండ పాకల బీచ్‌లో “యోగాంధ్ర-2025” భాగంగా సామూహిక యోగ కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:-

ఆరోగ్యమైన సమాజం నిర్మాణంలో భాగంగా, జూన్ 21, 2025న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా యోగ దినోత్సవానికి మాస్ ఉద్యమంగా రంగం సిద్ధమవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “యోగాంధ్ర – 2025” మాసోత్సవాల్లో భాగంగా, సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఆదివారం ఉదయం రాష్ట్రస్థాయి యోగ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల కృష్ణ, ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, యోగాసనాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగా అనేది భారతీయ సంప్రదాయానికి నుడివేళ్లతో సంబంధం ఉన్న శక్తివంతమైన సాధన అని, ఇది ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. ప్రజలంతా యోగాను ప్రతిరోజు జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని కోరారు. యోగాంధ్ర క్యాంపెయిన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో యోగ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. అదే రోజు విశాఖపట్నం బీచ్‌లో 5 లక్షల మంది పాల్గొనే యోగ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు అని చెప్పారు.జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, జూన్ 21న జరుగుతున్న యోగ దినోత్సవానికి జిల్లాలో భారీగా ప్రజలు పాల్గొనేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 9.6 లక్షల మంది యోగాంధ్ర యాప్ ద్వారా నమోదు కావడం సంతోషకరమని పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, యోగా శారీరక ఆరోగ్యానికి తోడుగా మానసిక స్థైర్యాన్ని అందించే సాధనమని, దానిని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒత్తిడిని తగ్గించడంలో, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో యోగాకు ప్రత్యేక స్థానం ఉందని వివరించారు.జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో 6,758 ప్రదేశాల్లో యోగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 20న స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రత్యేక కార్యక్రమం, జూన్ 21న భారీ యోగా వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!