శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో బి.ఫార్మసీ పట్టభద్రుల దినోత్సవం నిర్వహించిన యాజమాన్యం

మన న్యూస్ చిత్తూరు జూన్-14

చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల (అటానమస్) ఆర్ వి ఎస్ నగర్ బి.ఫార్మసీ విద్యార్థుల పట్టభద్రుల వేడుక ఘనంగా నిర్వహించబడం జరిగింది. విద్యార్థుల విద్యార్హతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం, విద్యార్థుల స్ఫూర్తిని రెట్టింపు చేస్తోంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అపోలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ హాజరై, విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. “పరిశ్రమల్లో నాణ్యతతో పాటు నైతిక విలువలూ అంతే ముఖ్యమైనవి. నేటి యువత విజ్ఞానంతో పాటు మానవతా విలువలను కూడా పెంపొందించుకోవాలి,” అని ఆయన వ్యాఖ్యానించారు.

జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తరఫున హాజరైన డాక్టర్ దేవన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, మెరుగైన విద్యతో దేశాభివృద్ధిలో యువత పాత్రపై వివరించారు.

కళాశాల వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతీస్వరి కూడా విద్యార్థులను ఆశీర్వదిస్తూ, కళాశాల వారు అందిస్తున్న విద్యా ప్రమాణాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు, మెరిట్ అవార్డుల పంపిణీ, సర్టిఫికేట్ల అందజేత నిర్వహించబడింది. విద్యార్థుల కృషిని అభినందిస్తూ కళాశాల వేదిక గొప్ప మైలురాయిగా నిలిచింది.

Related Posts

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరి, మన న్యూస్ : ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్. గండిపాలెం వాగు నుండి అక్రమంగా అనధికారికంగా జెసిబిలను ఉపయోగించి ట్రాక్టర్లతో ఇసుకను పూడిక ఇసుకను అక్రమంగా తరలిస్తూ… ప్రభుత్వ ఆదాయానికి…

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజు పల్లె లో మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ ఆధ్యర్యంలో మాదిగ మహా మేళా కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తో ఎస్సీ వర్గీకరణను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

ఉదయగిరిలో ఆగని ఇసుక మాఫియా…? నిద్రమత్తులో ఉన్న ఇరిగేషన్ శాఖ…!!

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి.

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

నెల్లూరులో కూటమి ప్రభుత్వం, జగన్ పై విరుచుకుపడ్డ…….ఏ.పీ .సి .సి అధ్యక్షురాలు షర్మిల

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

ఎమ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

పొలం పిలుస్తోంది

పొలం పిలుస్తోంది

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం