

పాలసముద్రం మండలం న్యూస్ : ప్రభుత్వం రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్ గా మార్చడంలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు చేస్తే పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మనశ్శాంతి చదువులపై పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని తాసిల్దార్ అరుణకుమారి ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.ఈ మేరకు జిల్లా రెవిన్యూ అధికారి వారి ఆదేశానుసారము మండలంలోని తిరుమలరాజుపురం సచివాలయ పరిధిలోని ఐదు కేంద్రాల్లో మహిళలు పురుషులు మరియు విద్యార్థులతో తాసిల్దార్ యోగ చేయించడంతోపాటు ఆమె కూడా స్వయంగా యోగ ట్రైనింగ్ లో పాల్గొన్నది.ఈ సందర్భంగా ఆమె యోగా పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు గూర్చి అందరికీ వివరించారు.ముఖ్యంగా విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలంటే ప్రతిరోజు యోగ అరగంటపాటైన చేస్తే విద్యాభివృద్ధి చక్కగా జరుగుతుందని తెలియజేశారు.అలాగే ఉద్యోగస్తులు రైతులు శ్రామికులు గృహంలో ఉండే మహిళలు అందరూ యోగాన్ని పాటించి పని ఒత్తిడి తగ్గించుకోవడంతోపాటు కండరాలు మెదడు చురుగ్గా పనిచేస్తాయని వివరించారు.ప్రపంచ యోగ దినం సందర్భంగా జూన్ 21వ తేదీన విజయవాడ లో యోగ డేని నిర్వహిస్తారని మన మండలంలో కూడా ప్రతి ఒక్కరూ జూన్ 21వ తేదీన యోగాను ఇలాగే అధిక సంఖ్యలో పాల్గొని యోగ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ తో పాటు ఎమ్మారై ఎన్. దేవి విఆర్ఓ వెంకటాచలం, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ప్రజా ప్రతినిధులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.