
మన న్యూస్ సింగరాయకొండ:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, 15 తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు, పాకల బీచ్ వద్ద పెద్ద ఎత్తున 1500 మందికి సామూహిక యోగ ప్రదర్శన జరగనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖా మంత్రి డా. డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి , ప్రకాశం జిల్లా కలెక్టర్ , మున్సిపల్ కమిషనర్ , ఇతర అధికారులు హాజరుకానున్నారు.
ఈ యోగ శిబిరంలో సింగరాయకొండ మండలంలోని పాఠశాలలు, కాలేజీలు, యూత్ మరియు మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ప్రజలలో ఆరోగ్యంతో పాటు మానసిక నిబద్ధత పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.మండల పరిషత్ అభివృద్ధి (MDO) అధికారి మరియు తహసీల్దార్ లు ప్రజలను పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ ఆహ్వానించారు.