మోడల్ ప్రైమరీ పాఠశాలల ద్వారా విద్యా ప్రమాణాల పెంపు

మన న్యూస్ తవణంపల్లి జూన్-11

తవణంపల్లి మండలంలో పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొత్తం 8 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి మోడల్ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు తో పాటు, 1 నుండి 5 తరగతుల వరకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా మొత్తం 5 మంది ఉపాధ్యాయులు నియమించబడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా, మండలంలోని అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు స్వీకరించారు. ఇది విద్యా నిర్వహణ పరంగా ఎంతో కీలకమైన అడుగుగా భావించవచ్చు. ఈ సందర్భంగా యం ఈ ఓ పి.హేమలత మాట్లాడుతూ మోడల్ స్కూల్స్‌లో సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ ప్రతి విద్యార్థికి తగిన శ్రద్ధతో విద్య అందించడం నాణ్యమైన విద్యా ప్రమాణాలు కల్పించగలగడం
వంటి ప్రయోజనాలు కలుగనున్నాయి. అందువల్ల తల్లిదండ్రులైన మీరు ప్రభుత్వ మోడల్ పాఠశాలల ద్వారా అందుతున్న ఉచిత విద్య
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కానుక మధ్యాహ్న భోజన పథకం నిష్కళంకమైన విద్యా వాతావరణం
వంటి సదుపాయాలను వినియోగించుకోవాలని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సూపర్ ఫైన్ బియ్యం అనగా సన్నబియ్యం ప్రతి పాఠశాలకు సరఫరా చేయబడును. మీ పిల్లలను సమీప మోడల్ పాఠశాలల్లో చేర్పించి, వారి భవిష్యత్తును మెరుగుపరిచే దిశగా ముందడుగు వేయాలని సూచించడం జరిగింది. తెలిపారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..