ఈ పని చేయకపోతే.. పీఎం కిసాన్ డబ్బులు పడవు. వెంటనే అలర్ట్ అవ్వండి

Mana News :- దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద వచ్చే 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ నెలలో 20వ విడత నిధులు విడుదల చేయనుంది. అయితే, ప్రతి రైతుకు డబ్బులు జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిగా చేసి ఉండాలి. 20వ విడత నిధుల కోసం తప్పనిసరిగా చేయాల్సినవి: e-KYC పూర్తి చేయాలి: రైతులు తప్పనిసరిగా తమ e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది పూర్తి కాకపోతే డబ్బులు ఖాతాలోకి రావు.

ఈ-కేవైసీ ఎలా చేసుకోవాలంటే.. * PMKisan.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి, * ‘Kisan Corner’ సెక్షన్‌కి వెళ్లి ‘e-KYC’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. * అక్కడ ఆధార్ నంబర్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి. దీంతో e-KYC పూర్తి అవుతుంది. ఆధార్, బ్యాంక్ లింక్: రైతుల బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అప్పుడే DBT (Direct Benefit Transfer) ద్వారా డబ్బులు నేరుగా ఖాతాలోకి వస్తాయి. భూ రికార్డుల ధృవీకరణ: రైతుల భూమి వివరాలు ప్రభుత్వ భూ రికార్డులతో సరిపోయేలా వెరిఫై చేయాలి. భూమి లేనివారికి ఈ పథకం వర్తించదు. మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలి: మీ ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోవాలి. OTPలు అందుకోవడానికి ఇది అవసరం. పీఎం కిసాన్ పథకం వివరాలు: ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.6000 రైతుల ఖాతాల్లో జమ అవుతుంది మూడు విడతల్లో, ప్రతి విడతలో రూ.2000 చొప్పున DBT ద్వారా జమ చేస్తారు ఈ పథకం 2019లో ప్రారంభమైంది. 12 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

Related Posts

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

దగ్గుబాటిని, చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలి.-చిరంజీవికి రెండేసి పెన్షన్లు అవసరమా!

కూటమి మాజీ ప్రభుత్వ నేతలకు ఒక్కొక్కరికి రెండేసి పెన్షన్లు.ఉరవకొండ మన న్యూస్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారుకాగా చిరంజీవి ఆదర్శంగా నిలిచి రెండేసి పెన్షన్లను తక్షణమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..