

తిరుపతి మన న్యూస్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ హద్దుల్లో నకిలీ డాక్యుమెంట్లతో ఆస్తుల మోసాలకు పాల్పడిన కామసాని మునిరత్నం రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నంబరు 352/2025 కింద నమోదు చేసిన కేసులో నిందితుడు పలు forged సంతకాలు, నకిలీ ఒప్పంద పత్రాలతో కొందరి ఆస్తులను ఇతరులకు అమ్ముతూ మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.కామసాని మునిరత్నం రెడ్డి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతడి స్వస్థలం తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలానికి చెందిన గంగుడుపల్లి గ్రామం. ప్రస్తుతం చెన్నై మెడవాకంలోని ఇషా అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు.శ్రీనివాస హౌసింగ్ సొసైటీకి చెందిన శారద అనే మహిళకు సంబంధించిన ఫ్లాట్ను ఆమె సంతకాన్ని forge చేసి, ఇద్దరు సహ నిందితులతో కలిసి అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి 86 లక్షలకు విక్రయించాడు. అలాగే, వేదిక్ అపార్ట్మెంట్స్లో ఇప్పటికే అమ్మిన ఫ్లాట్ను మరో వ్యక్తికి లీజ్కి ఇచ్చి మోసానికి పాల్పడ్డాడు.ఇతడు ఎస్. రాజకుమారి అనే మహిళపై నమ్మకం కల్పించి రూ. 30 లక్షలు తీసుకుని ఆమె భూమిని తన భార్య పేరిట రిజిస్టర్ చేసి మూడో వ్యక్తికి అమ్మాడు. పలు కోర్టుల్లో నకిలీ అఫిడవిట్లు, ఒప్పంద పత్రాలు, ఫోర్జరీ సంతకాలు వినియోగించి విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.నిజమైన డాక్యుమెంట్లు కలిగిన బాధితుల నుంచి అసలు పత్రాలు సేకరించిన తరువాత వాటిని forge చేసి మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయించిన అనేక ఉదాహరణలు ఈ కేసులో బయటపడ్డాయి.నిందితుడిని జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో నాయుడుపేట సమీపంలోని సి. మల్లవరం క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, సెల్ఫోన్ మరియు ఇతర డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.