Tirupati , Mana news:- , 06.06.2025 :* అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్‌ కార్యనిర్వాహక అధికారి శ్రీ సి. నరసింహులు నాయుడు గారి నాయకత్వంలో మరియు స్థిరత్వం పట్ల ఉన్న నిబద్ధతలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంస్థలో ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా, ఆపరేషన్లు ఇండస్ట్రీస్ బ్యాటరీస్ డివిజన్ హెడ్ శ్రీ ఎం. శ్రీనివాసరావు గారు మరియు ఆటోమేటివ్ బ్యాటరీస్ డివిజన్ హెడ్ శ్రీ బి. మునీశ్వర నాయుడు గారు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, పర్యావరణాన్ని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ “ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించండి” అని పేర్కొంటూ, ప్రతి ఉద్యోగి తమ రోజువారీ జీవితంలో పర్యావరణ హితమైన అలవాట్లను పాటించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను అవలంబించి, వలయాకార ఆర్థిక విధానాలను పాటించడం ద్వారా భవిష్య తరాల కోసం ఆరోగ్యవంతమైన, స్థిరమైన భూమిని నిర్మించాలనే సంకల్పాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా, హెల్త్ అండ్ సేఫ్టీ హెడ్ డాక్టర్ సదాశివన్ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ఏర్పడుతున్న తీవ్రమైన ప్రభావాలను వివరించారు. ఏకవినియోగ ప్లాస్టిక్ వినియోగం కారణంగా సముద్ర జీవులు, అడవి జంతువులు మరియు మానవ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నాయని చెప్పారు. ప్రతీ ఒక్కరూ దీని నుండి బయటపడటానికి మంచి ప్రత్యామ్నాయాలను స్వీకరించి, పునర్వినియోగం ప్రోత్సహించి, బాధ్యతాయుతమైన అలవాట్లను పాటించాలని కోరారు.పచ్చదనం కోసం చేపట్టిన ఓ అర్థవంతమైన కార్యక్రమంగా, కారఖానా ప్రాంగణాల్లోని తిరుపతి జిల్లా, కారకంబాడి మరియు చిత్తూరు జిల్లా, నునెగుండ్లపల్లిలో ఉన్న రెండు యూనిట్లలో మొత్తం 500కి పైగా మొక్కలను విభాగాధిపతులు మరియు ఉద్యోగులు కలసి నాటారు. కార్యక్రమం అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయడం ద్వారా అమరరాజా సంస్థ పర్యావరణ సంరక్షణ, స్థిరత్వం మరియు శుభ్రమైన భవిష్యత్తు పట్ల తమ నిబద్ధతను మరోసారి వ్యక్తీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *