

మన న్యూస్ తవణంపల్లె జూన్-6
పూతలపట్టు నియోజకవర్గం,
తవణంపల్లె మండలం, సరకల్లు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వేరుశెనగ విత్తనాలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మరియు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కి, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డికి స్ధానిక నాయకులు పూలమాలు, దుశ్శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో అందజేసే వేరుశనగ విత్తనాలను రైతులు పంపిణీ చేసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… “రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులకు అధిక దిగుబడులు వచ్చే విధంగా నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న వేరుశనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే రైతులు సమయానికి సాగు పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉన్నదన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు పంట సాగు విషయంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని, గ్రామాల్లో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడుతో సంప్రదించడం జరిగిందని, 2,3 రోజుల్లో సరిపడే వేరుశనగ విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని, రైతులు ధైర్యంగా వేరుశనగ పంటలు వేయచ్చని, వేరుశనగ విత్తనాల పంపిణీలో ఎటవంటి సమస్యలు వచ్చిన రైతులు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియూసీ కార్యదర్శి యువరాజు నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లి మండల టిడిపి అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాలెం మండల అధ్యక్షులు ఎన్.పి. ధరణి నాయుడు, బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు, తవణంపల్లి క్లస్టర్ ఇంచార్జ్ సునీల్ చౌదరి, యాదమరి క్లస్టర్ ఇంచార్జ్ చిత్రానాయుడు, ఐరాల జడ్పిటిసి సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జడ్పిటిసి లతా బాబు నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ చైర్మన్ మణి నాయుడు, మాజీ పూతలపట్టు మండల అధ్యక్షులు చంద్రమౌళి, టిడిపి సీనియర్ నాయకులు రఘురాం చౌదరి, ప్రవీణ్ కుమార్ నాయుడు, తవణంపల్లి మండల మహిళా అధ్యక్షురాలు చిట్టెమ్మ, సరుకలు సర్పంచ్ కత్తి సతీష్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
