శ్రీ సీతారాముల దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముట్టుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా రాముల వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, మరియు పలమనేరు శాసనసభ్యులు యన్.అమరనాధ్ రెడ్డి హాజరయ్యారు. ముట్టుకూరు గ్రామంలోని సీతారాముల ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా, మండల నాయకులు దుశ్శాలువతో సత్కరించి, గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని శ్రీ సీతా రాముల వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గోన్నారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించి, స్వామి వారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. “ముట్టుకూరు గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణంకు సహాయ సహకారాలు అందించిన గ్రామస్తులకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి పవిత్ర ఆలయాల నిర్మాణం ఒక్క ఆధ్యాత్మికత కోసమే కాదు, సమాజం ఐక్యతకూ, శాంతికి, సాంస్కృతిక విలువల ప్రేరణకూ మూలస్తంభాల వంటివి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియూసీ కార్యదర్శి యువరాజుల నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె ‌మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ కమీటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ ఛైర్మెన్ మణినాయుడు, తవణంపల్లె మండల క్లస్టర్ ఇంఛార్జ్ సునీల్ చౌదరి, యాదమరి మండల క్లస్టర్ ఇంఛార్జ్ చిత్రా నాయుడు, ఐరాల మండల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జెడ్పిటీసీ లతా బాబునాయుడు, పూతలపట్టు మాజీ మండల అధ్యక్షులు చంద్రమౌళి, టిడిపి సీనియర్ నాయకులు రఘురాం చౌదరి, ప్రవీణ్ కుమార్ నాయుడు, తవణంపల్లె మండల మహిళ అధ్యక్షురాలు చిట్టెమ్మ, సరకల్లు సర్పంచ్ కత్తి సతీష్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..