ముత్తరపల్లెలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..

మన న్యూస్ తవణంపల్లె జూన్-1

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముత్తరపల్లె గ్రామంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఆదివారం ముత్తరపల్లె గ్రామానికి చేరుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్”* తవణంపల్లె మండల తహసీల్దారు సుధాకర్ మరియు మండల నాయకులు పుష్ప గుఛ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముత్తరపల్లె గ్రామంలో రేషన్ షాపులో సామాన్య ప్రజలకు బియ్యం పంపిణీ చేసారు. అనంతరం గ్రామంలో 65 ఏళ్ళు పైబడిన వృద్దులు, వికలాంగుల ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే స్వయంగా బియ్యం అందజేశారు. అనంతరం రేషన్ షాపులోని సరుకుల నిల్వ, తూకాల కొలతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విధానాలతో లబ్ధిదారులు వెళ్ళిన సమయానికి రేషన్ షాపు సరుకులు అందేవి కాదని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందించాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలు గుర్తించి పాత పద్దతిని అమలు చేస్తూ ఒక‌ మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రతి  నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకూ రేషన్ షాపుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో రేషన్ అందించడం జరుగుతుందని, అదేవిధంగా 65 సంవత్సరాల పైబడిన వృద్దులకు, వికలాంగులకు ఇంటికి రేషన్ సరుకులు అందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె మండల తహసీల్దారు సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె మండల టిడిపి అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, క్లస్టర్ ఇంఛార్జ్ మోహన్ నాయుడు,  టిడిపి‌ నాయకులు ప్రవీణ్ కుమార్ నాయడు, పట్నం గోపి, లవకుమార్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి