

వెదురుకుప్పం, మన న్యూస్ :- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హేమంత్ రెడ్డి గతంలో యువజన విభాగం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శిగా, యూనివర్సిటీ అధ్యక్షులుగా గత 11 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసారు.గతంలో విద్యార్థులు, యువత సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఈయనను రాయలసీమ జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ భాద్యతలు అప్పగించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, యంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, జిల్లాలోని సమన్వయకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటానని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లి, యువతతో కలిసి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డిని జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, పలువురు నాయకులు అభినందించారు.