వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హేమంత్ రెడ్డి గతంలో యువజన విభాగం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శిగా, యూనివర్సిటీ అధ్యక్షులుగా గత 11 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసారు.గతంలో విద్యార్థులు, యువత సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఈయనను రాయలసీమ జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ భాద్యతలు అప్పగించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, యంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, జిల్లాలోని సమన్వయకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటానని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లి, యువతతో కలిసి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డిని జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, పలువురు నాయకులు అభినందించారు.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి