వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హేమంత్ రెడ్డి గతంలో యువజన విభాగం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శిగా, యూనివర్సిటీ అధ్యక్షులుగా గత 11 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసారు.గతంలో విద్యార్థులు, యువత సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఈయనను రాయలసీమ జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించడం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ భాద్యతలు అప్పగించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, యంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, జిల్లాలోని సమన్వయకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటానని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లి, యువతతో కలిసి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డిని జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, పలువురు నాయకులు అభినందించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..