

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కడప మహానాడులో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. బార్బర్ షాపులకు ఉచిత విద్యుత్ తో పాటు, దేవాలయ పాలకమండలిలలో చోటు కల్పించాలని ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి జీవితాంతం నాయి బ్రాహ్మణ సోదరి సోదరీమణులందరూ రుణపడి ఉండాలని చెప్పారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా నాయి బ్రాహ్మణులు రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగిందని రుద్రకోటి సదాశివ గుర్తు చేశారు. ఏదిఏమైనా కడపలో మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు నాయి బ్రాహ్మణులలో మరింత ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు.
