వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి ,పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి………. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి

మన న్యూస్, కోవూరు,మే30:*వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపు పై, కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి.*గత ఏడాది క్వింటాలుకు రూ.117 పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే పెంచింది.*ప్రతి ఏడాది పెట్టుబడి ఖర్చులు 10 శాతం నుండి 15 శాతం పెరుగుతుంటే మద్దతు ధర కేవలం 3 శాతం మాత్రమే పెంచారు.*రైతాంగానికి ఎన్నో విధాలుగా ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరపై పునః పరిశీలన చేసి, ధాన్యం మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలి .కోవూరు లో శుక్రవారం తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ*………..కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధరను(M S P) ప్రకటించింది అని అన్నారు.పప్పు ధాన్యాలు మరియు ఇతర పంటలకు సంబంధించి ప్రకటించిన మద్దతు ధర ను 5 శాతం నుండి 10 శాతం వరకూ పెంచారు.కానీ రాష్ట్రంలో అత్యధికంగా పండించే వరి ధాన్యం కు మద్దతు ధరను కేవలం 3 శాతం మాత్రమే పెంచారు అని అన్నారు.గత ఏడాది క్వింటాలుకు రూ.117 పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే పెంచింది అని అన్నారు.గత ఏడాది వరి సాగు ఖర్చు ఎకరానికి 30 వేలు ఖర్చు అయితే,ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు,పురుగు మందుల,కూలీల ఖర్చులు పెరిగి దాదాపు 40 వేలు వరకూ ఖర్చు అవుతుంది అని అన్నారు.అయితే వరి ధాన్యం కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పెరిగిన పెట్టుబడులు ఖర్చులకు అనుగుణంగా లేదు అని అన్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక క్వింటాలు వరి ధాన్యం ఉత్పత్తి కి జాతీయ సగటు వ్యయం రూ.3135 కాగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.2369 మాత్రమే అని అన్నారు.రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించి నప్పటికీ,పకృతి వైపరీత్యాలు,అకాల వర్షాలు లాంటి వాటి వలన పండించిన పంట చేతికి వచ్చే వరకూ గ్యారెంటీ లేదు.రైతు బ్రతుకు గాలిలొ దీపం లాంటిది అని అన్నారు.దేశంలో రైతాంగానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర విషయంలోనూ ఉదారంగా వ్యవహరించి రైతాంగాన్ని ఆదుకోవాలి అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం వాస్తవిక పరిస్థితులను,స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని, వరి ధాన్యం కు ప్రకటించిన కనీస మద్దతు ధర పై పునఃపరిశీలన చేసి కనీస మద్దతు ధరను క్వింటాలుకు మరో రూ.300 అన్నా పెంచి ధాన్యం పండించే రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి