

తిరుపతి, మన న్యూస్ : తిరుమలలో వెలసియున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు ఎమ్మెల్యే లు కలసి పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడప గడపలో మే 27, 28, 29, తేదీలలో మహానాడు లక్షలాది మంది పసుపుదళం పాల్గొని విజయవంతం చేశారు. వరుణ దేవుడు, సూర్య భగవానుడు, దివ్య ఆశీస్సులు అందించి, ఒక చక్కని వాతావరణాన్ని అందించారు. అహర్లాదకరమైన పండుగ వాతావరణంలో ఆకాశమంత అభిమానంతో నింగికి ఎగసిపడే ఉత్సాహంతో, యువత నినాదాలతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అద్భుతమైన ప్రసంగంతో, విజయవంతమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకున్నట్లు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తెలిపారు.