దళిత యువకులను చిత్రహింసలు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్

మన న్యూస్ సింగరాయకొండ:-
తెనాలి పట్టణంలో దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై మోకాళ్లపై అరికాళ్ళపై కొడుతూ పోలీసులు చిత్రహింసలుపెట్టడాన్ని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ ,మోహన్, జై భీమ్ పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు ,ముస్లిం జేఏసీ నాయకులు జావేద్ తదితరులు తీవ్రంగా ఖండించారు , దళిత యువకులను చిత్రహింసలు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెనాలి పట్టణంలోని అయితా నగర్ కు చెందిన దళిత యువకులు ముగ్గురిని ఏప్రిల్ 25వ తేదీ అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని రాత్రంతా కస్టడీలో చిత్రహింసలు పెట్టిన పోలీసులు మరుసటి రోజు ఏప్రిల్26వ తేదీ పోలీస్ స్టేషన్ సమీపంలోనడిరోడ్డుపై రాకేష్ ,జాన్ విక్టర్, బాబులాల్ యువకులపై సీఐ రాములు, ఎస్ఐ రమేష్ బాబు యువకుల మోకాళ్లపై బూట్ల కాళ్లతో తొక్కి పట్టి అరికాళ్ళపై లాఠీలతో కొడుతూ వీడియో తీశారని ,ఒకవేళ ఆ యువకులు నేరం చేసి ఉంటే చట్టపరంగా అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచాలని ,చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు పోలీసులకు లేదని విమర్శించారు. మే 25 సోమవారం 25వ తేదీన ఈ వీడియో వైరల్ అయిన తర్వాత దళితుల యువకులపై రౌడీషీట్ అప్పటికప్పుడు ఓపెన్ చేశారని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి

వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో దళితులను బహిష్కరించారు, దళితులను బహిష్కరించిన వారిని ఎంతవరకు అరెస్టు చేయకుండా కాపాడుతున్నారు ,ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలతో ఊరేగింపు చేస్తే గ్రామంలోని అగ్ర కులోన్మాదులు అడ్డుకున్నారు, ఏప్రిల్ 29వ తేదీన గ్రామంలోని దళిత యువకులు జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు వారిపై కేసు నమోదు చేయలేదు, అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు, కందుకూరు మండలం దప్పలంపాడు గ్రామంలో దళితులపై అగ్రకునోన్మాదులు మూకుమ్మడిగా అర్ధరాత్రి దాడి చేస్తే రాజీ చేశారని , గ్రామంలోని మాదిగలపై దాడి చేసిన అగ్రకులోన్మాదులను అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు,అందువలన దళిత ,ప్రజాస్వామ్య , ప్రగతిశీల శక్తులు ఓటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా
ఉద్యమించాలని డిమాండ్ చేశారు
బి సుధాకర్ కాటుపాలెం అంబేద్కర్ నగర్
చొప్పర మోహన్ రావు పాస్టర్ గారు
పసుమర్తి శివ కోటయ్య పాకల అంబేద్కర్ నగర్
చొప్పర్ ప్రసాద్ వెంకటేశ్వర చిన్న కాలనీ

Related Posts

చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

తిరుపతి మన న్యూస్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ హద్దుల్లో నకిలీ డాక్యుమెంట్లతో ఆస్తుల మోసాలకు పాల్పడిన కామసాని మునిరత్నం రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం నంబరు 352/2025 కింద నమోదు చేసిన కేసులో నిందితుడు పలు forged సంతకాలు,…

ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

పుత్తూరు , మన న్యూస్, జూన్ 8: అఖిల భారత క్షత్రియ మహాసభ – 1897 యువ విభాగం జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ ను ఆంధ్రప్రదేశ్ అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు కోనేటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్