

ఆదిభట్ల. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో టిసిఎస్ ప్రాంతంలో సరస్వతి & యుగేందర్ నేతృత్వంలో నెలకొల్పినయూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి , ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు, కాలానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు, ఈ కార్యక్రమంలో నరసింహారాజు, కిరణ్, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మర్రి నవీన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.