ఆధార్ నమోదు సెంటర్లో నిలువు దోపిడి

మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం, మూలగుంటపాడు పంచాయతీ గ్రామ సచివాలయం 2 లో ఈనెల 26వ తేదీన నెల్లూరు ఐసి డిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆధార్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జయమణి గారు చెప్పినప్పటికీ ఆధార్ సెంటర్ పై పర్యవేక్షణ లేనందువలన ఆధార్ సేవలు ముసుగులో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లించవలసి ఉన్నప్పటికీ దానికి భిన్నంగా రెండు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐయినా బత్తిన రాజేష్ దృష్టికి తీసుకొని రావడం జరిగినది. ఈ విషయంపై స్పందించిన రాజేష్ గారు ఆధార్ సెంటర్ ని తనిఖీ చేయగా ప్రజలు చెప్పిన విషయం నిజమేనని 100రూపాయలకు 230 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని డేటా ఆపరేటర్ టీ చెంచు రామారావు ని వివరణ అండగా పొంతన లేని సమాధానం చెప్పడం జరిగింది. వెంటనే ఎంపీడీవో జయమణి గారికి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తెలియపరిచి వెంటనే ప్రభుత్వధరల పట్టిక కూడా ఏర్పాటు చేయాలని అవసరమైతే ఎవరైనా ఎస్సీ ఎస్టీ పేదలు డబ్బులు లేకపోతే వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, డేటా ఆపరేటర్ చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం లో పేదలకు అండగా ఉండడమే గౌరవనీయులు సాంఘిక సంక్షేమ వాలంటరీల శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి నియోజవర్గంలో ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు. కనుక అధికారులు ప్రజల పక్షాన బాధ్యతతో నిజాయితీతో నిబద్ధతతో పని చేయాలని ఎక్కడ అవినీతికి తావు ఉండకూడదని, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ అధికారులకు చెప్పడం జరిగినది. మరొకసారి ఇలాంటి ఘటన పునరావత్తం అయితే పై అధికారులు దృష్టికి తీసుకువెళ్లి మీపై చర్యకు సిఫారసు చేయవలసి ఉంటుంది.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి