

జలదంకి,, మన న్యూస్ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జలదంకి మండలం కమ్మవారిపాలెం గ్రామంలో శనివారం బీట్ ద హీట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ డ్రామా ఏపిడి మృదుల ఎంపీడీవో బ్రహ్మయ్య ఎమ్మార్వో ,స్థానికులు నాయకులు అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినెలా మూడోశనివారం స్వర్ణ ఆంధ్ర..స్వచ్ఛ ఆంధ్ర పేరుతో ప్రభుత్వం పర్యావరణ హితం కోసం ప్రత్యేక థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వారం బీట్ ద హీట్ పేరుతో వేసవి ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడం, ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు కై మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పట్టణప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న భవన నిర్మాణాల వలన రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం వుందన్న ఎమ్మెల్యే, ఉష్ణోగ్రతలు కొంతమేర అయినా తగ్గించేందుకు కిచెన్ గార్డెన్స్, రూఫ్టాప్ గార్డెన్స్ పట్ల మహిళలు ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. దీంతో ఇంటికి అవసరమయ్యే కూరగాయలు కూడా లభిస్తాయని, ఖర్చు తగ్గుతుందని, పర్యావరణం మెరుగుపడి ఆహ్లాదకర వాతావరణం లభిస్తుందన్నారు. మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ స్థానికంగా ఖాళీగా వున్న స్థలాల్లో మొక్కలను నాటాలన్నారు. భవిష్యత్తరాల ప్రయోజనాల కోసం మొక్కలను నాటడం…వాటిని సంరక్షించడం మనందరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
మహిళలందరూ కూడా మొక్కలు బాగా పెంచాలని…పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మండల నాయకులు అధికారులు తదితరులున్నారు.