సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

మన న్యూస్,తిరుప‌తిః 44వ డివిజ‌న్ మ‌ధురాన‌గ‌ర్ లో 36.65 ల‌క్ష‌ల‌తో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు గురువారం ఉద‌యం ప్రారంభించారు. ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులుకు జ‌న‌సేన కార్పోరేట‌ర్ వ‌రికుంట్ల నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో కార్పోరేట‌ర్లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పూజాకార్య‌క్ర‌మం త‌రువాత శిలాఫ‌ల‌కాన్ని ఎమ్మెల్యే ఆర‌ణి ఆవిష్క‌రించి రోడ్డును ప్రారంభించారు. ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే న‌గ‌రంలోని రోడ్ల ప్యాచ్ వ‌ర్క‌ల‌ను పూర్తి చేసిన‌ట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ‌త పాల‌కుల తీరుతో మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ను అప్పుల కుప్ప‌గా మారింద‌ని ఆయ‌న ఆరోపించారు. తిరుప‌తిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, యువ‌నాయ‌కులు ఐటి శాఖ మంత్రి లోకేష్ లు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కాగా న‌ర్శ‌రీరోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌తో రాక‌పోక‌లకు ఇబ్బందిగా మారింద‌ని స్థానికులు ఎమ్మెల్యే కు విన్న‌వించుకున్నారు. రోడ్డును ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పోరేష‌న్ ఎస్ ఈ శ్యామ్ సుంద‌ర్, ఎంఈ గోమ‌తి, డిప్యూటీ మేయ‌ర్ ఆర్సి మునికృష్ణ‌, కార్పోరేట‌ర్లు దూది కుమారి, సికే రేవ‌తి, ఆదం సుధాక‌ర్ రెడ్డి, దూది శివ‌, యాద‌వ‌కృష్ణ‌, రాజా రెడ్డి, సుధాక‌ర్, సాయిదేవ్ యాద‌వ్, బాజ్జీ, రాజేష్ ఆచ్చారి, ఆళ్వార్ మురళీ, ఆముదాల వెంక‌టేష్, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, కొండా రాజ్ మోహ‌న్, రమేష్, సుధీర్, మున‌స్వామి, ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 4 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…