గూడూరు లో శ్రీసాయి సత్సంగ నిలయంశ్రీవిజయ దుర్గ అమ్మవారి ఉప పీఠంలో”శ్రీ విజయ దుర్గ అమ్మవారి 17వ శ్రీ చక్ర వార్షికోత్సవ వేడుకలు”

మన న్యూస్ ,గూడూరు, మే 5: శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు, వెదురుపాక గురుదేవుల వారి దివ్య ఆశీస్సులతో 2008 వ సంవత్సరం నాడు వైశాఖ పౌర్ణమి మహా పర్వదినం నాడు అభిజిత్ లగ్న కాలంలో గూడూరులోని శ్రీవిజయ దుర్గ అమ్మవారి ఉప పీఠంలో శ్రీ చక్ర ప్రతిష్ట స్వయంగా గు”రుదేవుల దివ్య హస్తాలతో ప్రతిష్ట చేసి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడు వరస రోజులు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించబడును.ఈ కార్యక్రమాల్లో భాగంగా, మే 10వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు
శ్రీ మహా మృత్యుంజయ అమృత పాశుపత మహా రుద్రాభిషేక సహిత హోమము జరుగును.సాయంత్రం 6 గంటలకు : శ్రీ మళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శత్రుసంహార త్రిశతి హోమం విశేష రీతిలో నిర్వహించబడును. మే 11వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి మరియు మన సత్సంగం నిలయంలో స్వామి వారి ప్రతిష్ట జరిగి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వామివారికి చందనాభిషేకం నిర్వహించబడును.ఉదయం 9 గంటలకు: శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారి మహాయాగం నిర్వహించబడును. సాయంత్రం 6 గంటలకు : శ్రీ ఔషధ చక్ర నారాయణ మహా ధన్వంతరి యాగం, శ్రీ రాజశ్యామల మాతంగి, శ్రీ వారాహి అమ్మవారు, శ్రీ విజయ దుర్గ అమ్మవారి త్రిశతి హోమం నిర్వహించబడును.మే 12 తేది సోమవారం వైశాఖ పౌర్ణమి శ్రీ చక్ర వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు : మాతృమూర్తులచే శక్తీమాల యాగం నిర్వహించబడును.9.30 గంటలకు మాతృమూర్తులచే సౌందర్యలహరి సామూహిక పారాయణ అదే సమయంలో అమ్మవారికి పరిమళ సుగంధ ద్రవ్యాలతో మరియు కనకాభిషేకం నిర్వహించబడును.
తదనంతరం సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయ దుర్గా అమ్మవారి నక్షత్ర,నవగ్రహ పూర్వక అది దేవతా ప్రత్యధి దేవతా సహిత మహా నవావరణ హోమం మాతృమూర్తుల మంత్ర పఠనంతో నిర్వహించబడును.తదుపరి దశమహావిద్యలలోని అమ్మవార్ల మూలమంత్రంతో హోమం నిర్వహించబడును.కావున భక్తులందరూ పై విశేష కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులు కాగలరు.

Related Posts

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 8 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//