పూర్తి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

మన న్యూస్, నారాయణ పేట:సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిపారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే అందేలా చూడాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు,గతంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో అన్ని రాష్ట్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని, దీంతో అన్ని రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో మరోసారి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా మక్తల్ నియోజకవర్గానికి 175 కోట్లతో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని, నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని సూచించారు. పార్టీలకతీతంగా, ఎలాంటి భేషజాలకు పోకుండా పూరి గుడిసెలు, పెంకుటిల్లలో నివసిస్తున్న వారి వివరాలు తీసుకొని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. రాబోయే రోజుల్లో మరో 100 కోట్ల రూపాయలతో మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను సైతం తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మక్తల్ నియోజకవర్గం లో 3500 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఇంటి నిర్మాణ సమయంలో ఫోటోలు దిగి తాను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిలేటి సుధాకర్ రెడ్డి గార్లకు పంపించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తానని సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. ఇటీ సమావేశంలో నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///