తండ్రి ఇంటిపై కుమారుడి కాల్పులు

Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఆచారి వీధికి చెందిన రాజ్‌మల్‌జైన్‌కు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు దిలీప్‌కుమార్‌జైన్, మూడో కుమారుడు మనోజ్‌కుమార్‌జైన్‌ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. రెండో కుమారుడు హితేష్‌కుమార్‌జైన్‌ అలియాస్‌ జతిన్‌జైన్‌ వ్యసనాలకు బానిసై వివాహానంతరం శిఖరం వారి వీధిలో వేరుగా ఉంటున్నాడు. తండ్రి నుంచి ఇప్పటికే రూ.40 లక్షలు తన వాటాగా తీసుకున్నాడు. ఆ నగదుతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు. అయిదు సంవత్సరాల నుంచి సుబేదారుపేటలో దుర్గ గ్లాస్, ప్లైవుడ్‌ దుకాణం నిర్వహిస్తుండగా నష్టాలు వచ్చాయి. అప్పటినుంచి ఆస్తిలో వాటా కావాలని తల్లిదండ్రులు, అన్నదమ్ములను వేధిస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి తండ్రితో గొడవ పడుతున్నాడు. ఈ నెల 11న వచ్చి ఆస్తి పంపకాలు చేస్తారా? లేకుంటే తుపాకీతో కాల్చుకుంటానని బెదిరించాడు. పేలకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. శనివారం అర్ధరాత్రి అయిదుగురితో వచ్చి ఇంటి తలుపులు తెరవాలని గొడవ చేశాడు. కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. ఎవరూ రాకపోవడంతో లైసెన్సు కలిగిన పిస్తోల్‌తో ఒక రౌండు ఇంటి తలుపులపై కాల్చాడు.
ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. భయాందోళనలో ఉన్న బాధితులు ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నబజారు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడితో పాటు అతని వెంట వచ్చిన అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తుపాకీతో కాలుస్తున్న హితేష్

Related Posts

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 23 :- వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నెల్లూరు వి ఆర్ సి సెంటర్ లో జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ….. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు…

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

  • By APUROOP
  • April 24, 2025
  • 4 views
కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..