రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ – అవి రద్దు, పథకాలు దక్కాలంటే..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఇప్పటి కే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బోగస్ కార్డుల ఏరివేతకు నిర్ణయించింది. ఇక, కార్డుల జారీతో పాటుగా.. పథకాలకు రేషన్ కార్డులు ప్రామాణికం కావటంతో కొనసాగింపు.. కొత్తవి జారీ పైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులు ఈ నెల 31లోపు ఇకెవైసి ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగానికి ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తాజా ఆదేశాలు :- ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ప్రభుత్వం అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదిక కావటంతో.. పథకాల లబ్ది దారులు ఈ కార్డుల మంజూరు కోసం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో కార్డుల్లో మార్పుల చేర్పుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ది దారులు నిరీక్షిస్తున్నారు. అర్హత లేకుండా కార్డులు పొందిన వారివి తెలిగించేలా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తోంది. ఇక, ఇప్పుడు రేషన్ కార్డుల లబ్దిదారులు ఈ కేవైసీ తప్పని సరిగా చేసుకొనేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ కమిషనరు సౌరబ్‌గౌర్‌ ఆదేశించారు. ఈ కేవైసీ డెడ్ లైన్ :- ఇకెవైసి యూనిట్లు రేషన్‌ డీలర్లు, తహశీల్దార్లు, డిఎస్‌ఒల లాగిన్‌లలో యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొబైల్‌ యాప్‌, రేషన్‌ షాపుల్లోని ఈ పోస్‌ పరిక రాల ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఇకెవైసి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో రేషన్‌ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగు తున్నది. ఈకేవైసీ ప్రక్రియతో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల ప్రక్షాళనతో పాటు బోగస్‌ ఏరివేతకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులందరి బయోమెట్రి క్‌ నమోదు చేయడంతో దాదాపుగా కార్డులు ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్‌ పంపిణీ చేసేందుకు అవకాశం కలుగుతుందని డీలర్లు అంటున్నారు. పథకాల కోసం :- ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న ఈకేవైసీని లబ్ధిదారులు చేయించకుంటే వారి కార్డు రద్దే అవశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఈకేవైసీ జరగని కారణంగా ఆ రేషన్‌కార్డు రద్దు జాబితాలో చేరుతుందని చెబుతున్నారు. దీంతో, రేషన్‌కార్డు లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ చేయిం చుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు కోరుతున్నారు. దాదాపు 30 శాతం కార్డులకు ఇప్పటి కీ ఈ కేవైసీ పూర్తి కాలేదని సమాచారం. దీని కారణంగానే జిల్లా యంత్రాంగానికి తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వచ్చే మే నెల నుంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ముందుగా లబ్ది దారుల ఖరారులో భాగంగా రేషన్ కార్డులను ప్రామాణికం గా భావిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు రేషన్ కార్డుల కొనసాగింపు.. పథకాల లబ్దిదారుల ఎంపికలో ఈ కార్డులు – ఈ కేవైసీ ప్రక్రియ కీలకంగా మారుతోంది.

Related Posts

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు