ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

Mana News :- తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొనింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, మరి కొన్ని చోట్ల వడగళ్ల వాన పడుతుందన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది. ఇక, రేపు (మార్చి 22) కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా.. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారవణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి (మార్చి 23) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పుకొచ్చింది. అయితే, ఓవైపు ఎండలు.. మరోవైపు వర్ష సూచనతో తెలంగాణలో భిన్న వాతావరణం కనిపించనుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర కోస్తాలో ఈరోజు పొడి వాతావరణమే ఉండగా.. రేపు, ఎల్లుండి మాత్రం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరి కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది.

Related Posts

మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మీర్పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి, అక్కడి సమస్యలను పరిశీలించారు. ఫెన్సింగ్ ధ్వంసమై ఉండటం, వీధిదీపాలు పనిచేయకపోవడం,…

ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా

mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!