రోహిత్‌.. ఆ 25 పరుగులతో సంతోషమా?: సునీల్ గావస్కర్

Mana News, ఇంటర్నెట్ డెస్క్: భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌పై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపడేశాడు. జట్టు కెప్టెన్‌గా రోహిత్ దూకుడుగా ఆడుతుంటే డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం భిన్నంగా ఉంటోందని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.అయితే, ఈ వ్యాఖ్యలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. కేవలం 25 పరుగులతో కాదు.. 25 ఓవర్ల వరకూ క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలని సూచించాడు.”గత రెండేళ్లుగా రోహిత్ ఆడే తీరు ఇలానే ఉంటుంది. గత వన్డే ప్రపంచకప్‌ నుంచి ప్రారంభమైంది. ఇప్పటికీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. కొన్నిసార్లు విజయవంతమైనప్పటికీ.. అతడి టాలెంట్‌కు తగ్గ ఇన్నింగ్స్‌లు మాత్రం రావడం లేదు. ఇతరులతో పోలిస్తే అద్భుతమైన షాట్లు కొట్టగలిగే నైపుణ్యం అతడి సొంతం. ఇదంతా నేను అభిమానుల కోణంలో మాట్లాడా. అయితే, జట్టుపరంగా నేనేమీ మాట్లాడలేదు. ఒకవేళ అతడు కనీసం 25 ఓవర్లు క్రీజ్‌లో ఉంటే భారత్‌ కనీసం 180 నుంచి 200 పరుగులు చేస్తుంది. అప్పటికి కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఉందనుకుందాం.. ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు దూకుడుగా ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు 350 పరుగులను చేరడం చాలా సులువవుతుంది. ఇప్పుడు రోహిత్‌ను దూకుడుగా ఆడవద్దని చెప్పడం లేదు. కానీ, సగం ఓవర్ల వరకైనా అతడు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడు భారత్‌ విజయంపై తప్పకుండా ప్రభావం చూపిస్తాడు. ఓ బ్యాటర్‌గా నువ్వు 25-30 పరుగులతో సంతోషంగా ఉండగలవా? ఉండలేవని అనుకుంటున్నా. అందుకే, నేనొక మాట చెబుతున్నా. నీ ప్రభావం ఎక్కువగా ఉండాలంటే ఎప్పుడు ఏడెనిమిది ఓవర్లలోనే ఔట్ కాకూడదు.” అని తెలిపాడు.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 1 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు